మర్పల్లి : మండలంలోని తుమ్మలపల్లిలో 7కిలోల వంద గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటశ్రీను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమ్మలపల్లి గ్రామానికి చెందిన పెద్దగొల్ల పెంటయ్య సర్వే నంబర్ 195/అ లో గల వ్యవసాయ పొలాన్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద కౌలుకు తీసుకుని పొలంలో పత్తి, కంది పంట వేశాడు. అందులో గంజాయి మొక్కలు ఉన్నాయని సమాచారం తెలుసుకున్న ఎస్సై బుధవారం స్థానిక తాసిల్దార్ తులసీరామ్తో కలిసి పొలంలోని 40 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని తుకం చేయగా 7కిలోల 100 గ్రాములు వచ్చిందని తెలిపారు.
పంచనామా అనంతరం తాసిల్దార్ తులసీరామ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పెంటయ్యను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి మొక్కల పొలాన్ని మోమిన్పేట్ సీఐ వెంకటేశం సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కరుణాకర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.