మద్యం మత్తులో ఒక్కోసారి ఏం చేస్తున్నామో కూడా కొందరికి తెలియకుండా పోతుంది. అలాంటి ఘటనే తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. ఒక 26 ఏళ్ల గౌతమ్ బర్మన్ అనే యువకుడు బాగా మద్యం తాగేశాడు.
సోమవారం నాడు బాగా తాగి మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక ఒక కొబ్బరి చెట్టు ఎక్కాడు. కూలీగా పనిచేసే సదరు యువకుడు చెట్టు ఎక్కిన తర్వాత అతని కాలు జారడంతో కింద పడ్డాడు. కింద పడటంతో అతను చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
పశ్చిమబెంగాల్కు చెందిన గౌతమ్ అనే యవకుడు బెంగళూరులో పనిచేస్తున్నాడు. అక్కడే బాగా మద్యం బాగా తాగిన అతను.. కొబ్బరి చెట్టు ఎక్కాడు. అక్కడి నుంచి కింద పడి దుర్మరణం చెందాడు.