జయశంకర్ భూపాలపల్లి : ఫారెస్ట్ అధికారులపై పోడు రైతులు దాడి చేశారు. ఈ సంఘటన
జిల్లాలోని భూపాలపల్లి మండల పరిధి పంది పంపుల గ్రామం సమీపంలో చోటు చేసుకుంది. అటవీ శాఖలో ఏర్పాటు చేసిన పది ఎకరాల ప్లాంటేషన్ స్థానిక పోడు సాగు దారులు ధ్వంసం చేసి చదును చేసినట్లు భూపాలపల్లి రేంజర్ నరేష్ తెలిపారు.
పరిశీలన కోసం వెళ్లిన రేంజ్ ఆఫీసర్ దివ్య, బీట్ ఆఫీసర్ మర్రి శీను, బేస్ క్యాంప్ ఉద్యోగి నగేష్ పై పోడు భూమి సాగుదారులు కొమ్ము మహేష్ అతని భార్య మంజుల ఇతర కుటుంబ సభ్యులు పెట్రోల్ తో దాడి చేసినట్లు తెలిపారు. అనంతరం అటవీ శాఖ ఉద్యోగులను రెండు గంటలపాటు నిర్బంధించారు.
విషయం తెలుసుకున్న డీఎఫ్ ఓ లావణ్య జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చి పోలీసుల సహాయంతో ఉద్యోగులను విడుదల చేయించారు .పెట్రోల్ దాడిలో గాయపడిన రేంజర్ దివ్య ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Road accident |యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
నిందితుడు రాజు చేతులపై పచ్చబొట్టు ఎవరిదో తెలుసా?
నా చుట్టూ డజన్ల సంఖ్యలో కరోనా సోకినవాళ్లే ఉన్నారు: వ్లాదిమిర్ పుతిన్
Nusrat Jahan: ఎట్టకేలకు తన బిడ్డ తండ్రి ఎవరో చెప్పిన అందాల నటి