యాదాద్రి : ఉరేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మోటకొండూర్ మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మోత్కురు మండలంలోని ముసిపట్లకు చెందిన పావని(29)ని మోటకొండూర్ మండల కేంద్రానికి చెందిన భూమండ్ల మల్లేశ్తో 3ఏండ్ల క్రితం వివాహం కాగా, వీరికి రెండేళ్ల పాప కూడా ఉంది. ఈ మధ్యకాలంలోనే పావనికి మరో పాపపుట్టి చనిపోయింది. పుట్టిన ఊరైన ముసిపట్లకు వెళ్లిన మృతురాలు సోమవారం మోటకొండూర్కు చేరుకుంది.
ఇంతలోనే ఏమైందో గానీ మంగళవారం సాయంత్రం ఎవరూలేని సమయంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెందింది. పుట్టినపాప చనిపోవడంతో మనస్థాపానికి గురై మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనపై మోటకొండూర్ ఎస్సైని వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.