ఒక యువతితో లివ్ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడా 29 ఏళ్ల యువకుడు. ఆమెకు అప్పటికే పెళ్లయి, ఒక కుమార్తె కూడా ఉంది. అయినా సరే ఇద్దరూ ప్రేమించుకున్నారు. తమ పెళ్లికి ఎవరూ ఒప్పుకోరని తెలిసి పారిపోయారు. యూపీకి చెందిన అతను ఆమెతో రాజస్థాన్ చేరుకున్నాడు. జైపూర్లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని కలిసే ఉంటున్నారు.
ఆ యువకుడి పేరు మోహ్సిన్. అతనితో ఉంటన్న యువతి భర్త.. తన భార్య కోసం చాలా రోజులుగా వెతుకుతున్నాడు. ఇలా వీళ్లు జైపూర్లో ఉన్నట్లు అతనికి తెలిసింది. వెంటనే అక్కడకు చేరుకొని, ఇంట్లోకి వచ్చాడు. ప్రియురాలి భర్తను చూసిన మోహ్సిన్ భయంతో వణికిపోయాడు. అతన్నుంచి తప్పించుకునేందుకు ఐదో అంతస్తులోని ఫ్లాట్ నుంచి కిందకు దూకేశాడు.
దీంతో షాకైన మోహ్సిన్ ప్రియురాలు అతన్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లింది. అయితే చికిత్స పొందుతూ మోహ్సిన్ మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మోహ్సిన్ ప్రియురాలు, ఆమె భర్త పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. మోహ్సిన్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అప్పగించామని, పరారీలో ఉన్న భార్యాభర్తల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని వివరించారు.