హైదరాబాద్: నగరంలో పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా కూడా పోలీసుల చేతికి చిక్కింది. హైదరాబాద్ పోలీసులు ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఒక పిస్తోలు, తూటాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదకరమైన ముఠా కూడా పలుచోట్ల చోరీలు చేసి, కొంతమందిని గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా వుండగా, హైదరాబాద్ నగరంలో చోరీలకు పాల్పడుతున్న ఒక దొంగను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 54 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. సదరు నిందితుడు హైదరాబాద్ నగరంలో పలుచోట్ల చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.