కొత్తూరు రూరల్ : ప్రమాదవశాత్తు చెరువులోపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన కొత్తూరు మండలంలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ భూపాల్శ్రీధర్ తెలిపిన కథనం ప్రకారం.. కొత్తూరు మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామానికి చెందిన గున్ని వెంకటయ్య(43) వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటయ్య గ్రామంలో వ్యవసాయ కూలీపని అనంతరం గ్రామంలో గల అప్పచెరువు వద్ద కాళ్లు, చేతులు కడుకునే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారీ చెరువులో పడిపోయాడు.
గమనించిన స్థానికులు వెంకటయ్యను కాపాడేందుకు ప్రయత్నం చేయగా అప్పటికే వెంకటయ్య మృతి చెందినట్లు సీఐ తెలిపారు. ఈ ప్రమాదంపై వెంకటయ్య బంధువు అయిన బాలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.