దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ సైబర్ దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ప్రజలను మోసం చేయడానికి కేటుగాళ్లు కొత్త కొ్త్త వేషాలు వేస్తున్నారు. తాజాగా ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి వద్ద క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని ఆశచూపి రూ.96,000 దోచుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు.
దొంగతనం ఎలా చేసేవారంటే..
ఢిల్లీలో బ్యాంకులలో క్రెడిట్ కార్డ్ విభాగంలో పని చేసిన అనంత్, రాహుల్ అనే ఇద్దరు వ్యక్తులు.. అధిక మొత్తంలో డబ్బు త్వరగా సంపాదించాలనే దురాశతో ఉద్యోగాలు మానేసి దొంగతనాలు మొదలు పెట్టారు. ముందుగానే బ్యాంకులో పనిచేసిన అనుభవం ఉండడంతో వారికి క్రెడిట్ కార్డ్ కిటుకులు తెలుసు.
అందువల్ల బ్యాంకు కస్టమర్ల డేటా తీసుకొని వారి ఇంటికి వెళ్లారు. అక్కడ తాము బ్యాంకు నుంచి వచ్చామని క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతామని కస్టమర్లకు ఆశచూపేవారు. దీంతో అత్యాశకుపోయి.. ఆ కస్టమర్లు వారికి క్రెడిట్ కార్డ్ వివరాలన్నీ ఇచ్చేశారు. క్రెడిట్ కార్డ్తో కొన్ని పేమెంట్ యాప్లకు తమ ఫోన్లలో లింక్ పెట్టుకునేవారు. దీనికి కావాల్సిన ఓటిపిని కూడా కస్టమర్ వద్ద తీసుకునేవారు. ఆ తరువాత పేమెంట్ యాప్ల నుంచి డబ్బు డ్రా చేసుకునేవారు. ఇలా చాలా మంది కస్టమర్లకు దోచుకున్నారు.
చివరికి సైబర్ పోలీసులు బాధితుల క్రెడిట్ కార్డ్ల ద్వారా జరిగిన లావాదేవీలను పరిశీలించి మోసగాళ్లను పట్టుకున్నారు. నిందితులు అమన్, రాహుల్ నుంచి పోలీసులు నాలుగు మొబైల్ ఫోన్లు, రెండు సిమ్ కార్డులు, రూ.15,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.