చాంద్రాయణగుట్ట : ఓ వ్యక్తి హత్యకు గురైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరధిలో జరిగింది.మంగళవారం బండ్లగూడ అరోరా ఇంజనీరింగ్ కళాశాల దగ్గర్లో ఓ వ్యక్తి మృతదేహాం రోడ్డుపై పడి ఉందనే సమచారంతో ఫలక్నుమా ఏసీపీ మమ్మద్ మజీద్, చాంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ ప్రసాద్వర్మ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వీరయ్యలు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
క్లూస్ టీం, డాగ్స్కాడ్ బృందాలు క్షుణంగా పరిశీలించారు. మృతుడు మహ్మద్ హసీఫ్ (33), కుల్సూంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటాడనే సమాచారం పోలీసులకు తెలిసింది. మృతుడి ఒంటిపై బట్టలు లేకపోవడం పలు అనుమానా లకు తావిస్తుంది. ట్రాక్ ఫ్యాంట్, టీ షార్టు కొంత దూరంలో పడి ఉన్నాయి. హత్య ఎక్కడ జరిగింది..ఎందుకు జరిగింది? కారణాలు ఏమై ఉంటాయి అనే కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు.
కుల్సూంపురాలో ఉండే వ్యక్తి బండ్లగూడకు ఎందుకు వచ్చాడు. ఇతర ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని తీసుకొచ్చి బండ్లగూడ అరోరా కళాశాల సమీపంలో పడేశారా లేక స్థానికంగా ఏవరైన తెలిసిన వారు ఉండి ఉంటే వారి మధ్య జరిగిన గొడవల కారణాంగా హత్య చేసి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.