జైపూర్ : ఓ ఇద్దరు దళిత బాలికల పట్ల వంట మనిషి వివక్ష చూపించాడు. ఆ ఇద్దరు విద్యార్థినులు మధ్యాహ్న భోజనం వడ్డించారు. వంట మాస్టార్కు ఆ అమ్మాయిలు భోజనం వడ్డించడం నచ్చలేదు. దీంతో ప్లేట్లను విసిరివేయాలని మిగతా విద్యార్థులకు సూచించాడు. ఈ ఘటన రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది.
బరోడిలోని గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో మధ్యాహ్నం భోజనాన్ని లాల్రామ్ గుర్జార్ తయారు చేస్తున్నాడు. అయితే ప్రతి రోజు ఆయన అగ్రవర్ణాల విద్యార్థుల చేత మధ్యాహ్న భోజనం వడ్డించేవాడు. వారు సరిగా భోజనం వడ్డించట్లేదని టీచర్కు ఫిర్యాదుకు అందింది. దీంతో శుక్రవారం రోజు ఓ ఇద్దరు దళిత బాలికలను భోజనం వడ్డించమని టీచర్ చెప్పాడు. ఇది వంట మాస్టార్కు ఏ మాత్రం నచ్చలేదు. ప్లేట్లలో ఉన్న భోజనాన్ని విసిరివేయాలని అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులకు లాల్రామ్ సూచించాడు.
వంట మాస్టార్ తీరుపై దళిత బాలికలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. పాఠశాల వద్దకు చేరుకున్న పేరెంట్స్.. లాల్రామ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంట మాస్టార్ను అదుపులోకి తీసుకున్నారు.