శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లోని కుల్గాం జిల్లా బొనిగం ఖజిగంద్ ప్రాంతంలో మహిళ సాయంతో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోలీస్ కానిస్టేబుల్ సహా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. బాధిత మహిళకు నిర్వహించిన వైద్య పరీక్షల ద్వారా ఈ వ్యవహారం వెలుగుచూసింది.
డంజెన్ ప్రాంతంలో తమ కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పోలీస్ కానిస్టేబుల్ కిఫాయత్ అహ్మద్ మాలిక్, జహూర్ అహ్మద్ మిర్, ఇజాజ్ అహ్మద్ షా, షబ్రూజగా గుర్తించారు. నేరం జరిగిన సమయంలో కానిస్టేబుల్ డ్యూటీలో లేడని పోలీసులు తెలిపారు. నిందితులపై వారు ఎంతటి ఉన్నతస్ధానంలో ఉన్నా కఠిన చర్యలు చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు.