భోపాల్ : చదువుల నిలయాలుగా వెలుగొందాల్సిన విద్యాలయాల వన్నె నానాటికీ తగ్గుతోంది. మధ్యప్రదేశ్లోని ఓ స్కూల్ ప్రిన్సిపల్ గదిలో మద్యం బాటిళ్లు, కండోమ్ ప్యాకెట్లు బయటపడ్డాయి. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ బృందం మొరెనా జిల్లాలో ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేపట్టిన తనిఖీల్లో వీటిని గుర్తించారు.
స్కూల్ లైబ్రరీ నుంచి ఓ మతానికి సంబంధించిన ప్రచార సామాగ్రి కూడా లభ్యమైందని కమిటీ సభ్యురాలు డాక్టర్ నివేదిత శర్మ తెలిపారు. ఈ స్కూల్ను సీజ్ చేయాలని మొరెనా జిల్లా కలెక్టర్కు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సూచించింది.
స్కూల్ ప్రిన్సిపల్పై ఎక్సైజ్ శాఖ కూడా కేసు నమోదు చేసింది. తనిఖీల నేపధ్యంలో స్కూల్ను సీజ్ చేసినట్టు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కాగా, తమకు మద్యం అలవాటు లేదని, క్యాంపస్ వెలుపల నివాస ప్రాంతంలో మద్యం బాటిళ్లు లభించాయని కమిషన్ ఆరోపణలను ప్రిన్సిపల్ తోసిపుచ్చారు.