బండ్లగూడ : ఇద్దరు వృద్దుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….బండ్లగూడ జాగీర్ పరిధిలోని ప్రైమ్ ఓల్డేజీ హోంలో సాదీక్ హుస్సేన్, అయాజ్ అబ్ధుల్ అనే వృద్ధులు ఉంటున్నారు.
కాగా సాదీక్ హుస్సేన్ గత కొంత కాలంగా అయాజ్ అబ్దుల్ను అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడు. దీంతో బుధవారం రాత్రి 9 గంటల సమయంలో సాదీక్ హుస్సేన్ను (61) అయాజ్ అబ్దుల్ కిటికి గ్లాస్తో పోడిచాడు. ఇది గమనించిన ఇతరులు అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్ల్లు తెలిపారు.