Chhattisgarh | దొంగలు దోపిడీ చేసిన అనంతరం ఎవరి కంట పడకుండా వెళ్లిపోతారు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతుంటారు. కానీ ఈ దొంగ మాత్రం పోలీసులకు దొరికిపోయాడు. దొంగతనం చేశానని నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఆ దొంగ చెప్పిన సమాధానం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో ఇటీవలే రూ. 10 వేల దొంగతనం జరిగింది. బాధిత వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగను పట్టుకున్నారు. అయితే డబ్బులను ఎందుకు దొంగిలించావని ప్రశ్నించగా, ఒక గొప్ప పని కోసం అని చెబుతాడు. దీంతో అక్కడున్న పోలీసులంతా గట్టిగా నవ్వుతారు. మంచి పనికి దొంగతనం చేశాను. కానీ ఆ తర్వాత పశ్చాత్తాప పడ్డాను అని నిందితుడు ఒప్పుకున్నాడు. చలి తీవ్రంగా ఉండటంతో.. వీధుల్లో ఉండే వృద్ధులు, కుక్కలు, ఆవులకు దొంగిలించిన డబ్బుతో బెడ్షీట్లు కొని ఇచ్చానని చెప్పుకొచ్చాడు. అతని గొప్ప మనసుకు పోలీసులు కూడా ఫిదా అయ్యారు. మరి వారి నుంచి నీకు ఆశీర్వాదం లభించిందా అని పోలీసులు అడగ్గా.. ఆశీర్వాదం తీసుకున్నాను సర్ అని దొంగ తెలిపాడు.
चोरी करके अच्छा लगा..लेकिन बाद में पछतावा हुआ 😁 pic.twitter.com/b5bqFHDViG
— Shubhankar Mishra (@shubhankrmishra) December 2, 2022