చేవెళ్ల రూరల్ : రామన్నగూడెం-కొత్తపల్లి – ఎన్కేపల్లి మీదుగా ప్రవహించే వాగులో గుర్తు తెలియని దుండగులు ఆదివారం రసాయన పదార్థాలు చల్లడంతో వేలాది సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్కేపల్లి సమీపం గుండా ప్రవహిస్తున్న వాగులో దుండగులు రసాయనాలు చల్లారని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ పశువులు అటుగా వెళ్లి వాగులో నీరు తాగుతాయని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.