సిద్దిపేట : చేగుటం డిప్యూటీ తాసిల్దార్ చంద్రశేఖర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్కు చెందిన రఘునాథ్ రెడ్డి(ప్రభుత్వ ఉద్యోగి).. చేగుంట మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో వ్యవసాయ పొలాలను కొనుగోలు చేశాడు. అయితే ఈ భూముల కొనుగోలు విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడగా, పరిష్కారించాలని డిప్యూటీ తాసిల్దార్ చంద్రశేఖర్ను రఘునాథ్ రెడ్డి ఆశ్రయించారు. అంతేకాకుండా తన పొలంలో మూడు ఎకరాల విస్తీర్ణాన్ని మరో వ్యక్తికి పట్టా చేయడంతో దాని పరిశీలించాలని కోరారు. ఇందుకు చంద్రశేఖర్ రూ. 5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇస్తేనే పని అవుతుందని గత నెల రోజుల నుంచి రఘునాథ్ రెడ్డిని చంద్రశేఖర్ విసిగించారు. దీంతో ఏసీబీ అధికారులను రఘునాథ్ రెడ్డి ఆశ్రయించారు.
డిప్యూటీ తాసిల్దార్ రూ. 4.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. మొదట రూ. 2 లక్షల 70 వేలు చెల్లించాలని, ఆ తర్వాతే పని చేస్తానని చెప్పారు. దీంతో ఇవాళ ఉదయం చంద్రశేఖర్ రఘునాథ్ రెడ్డి నుంచి రూ. 2 లక్షల 70 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.