కాచిగూడ : రద్ధీగా ఉన్న ప్రాంతాల్లో దర్జాగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ యాదేందర్ తెలిపిన వివరాల ప్రకారం రేయిన్బజార్, పాషా కాలనీకి చెందిన సాధిక్ఖాన్ (36) వృత్తి రిత్యాకూలీ. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ సాధిక్ రద్దీగా ఉన్న ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తూ ఆ డబ్బుతో జల్సాలు చేసేవాడు.
ఇదే క్రమంలో గోల్నాక ప్రాంతానికి చెందిన పి.ఉదయశ్రీ ఈ నెల 18న కాచిగూడలోని టూరిస్ట్ చౌరస్తాలో ఆటో దిగింది. ఇదే ఆదనుగా భావించిన సాధిక్ఖాన్ ఉదయశ్రీ చేతిలోంచి రూ.30 వేల విలువ చేసే ఖరీదైన సెల్ ఫోన్ను లాక్కొని పారిపోయాడు.
ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కాచిగూడ పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా సాధిక్ఖాన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్సై వీర మల్లయ్య తెలిపారు.