మారేడ్పల్లి : రైల్లో ప్రయాణిస్తూ.. చోరీలకు పాల్పడుతున్న నిందితుడు దొంగిలించిన ఫోన్లో ఉన్న టెక్నాలజీతో పట్టుబడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ వాసి సాయిరాల్ (22) క్యాటరింగ్ పని చేస్తుంటాడు.
ఇతడు గత కొద్ది కాలంగా రైళ్లలో ప్రయాణిస్తూ.. ప్రయాణికుల బ్యాగులు, ఫోన్లను దొంగిలిస్తున్నాడు. ఈ నెల 23వ తేదీన రాత్రి నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైళ్లో సిద్దుసాయి అనే యువకుడు నగరానికి వస్తున్నాడు. అతని సామ్సంగ్ మొబైల్ ఫోన్ను చార్జింగ్ పెట్టి ఉంచాడు. కొంత సేపటి తరువాత ఫోన్ కనిపించలేదు.
విజయవాడకు పనిమీద వెళ్లిన రాల్ తిరిగి అదే రైల్లో నగరానికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఫోన్ దొంగిలించాడు. ఫోన్ కనిపించకపోవడంతో సిద్దుసాయి తన ఫోన్లో అంటి తెఫ్ట్ అప్లికేషన్ ద్వారా ఫోన్ను గుర్తించి నిందితుడిని ప్రయాణికుల సహాయంతో పట్టుకున్నాడు. సోమవారం రైలు సికింద్రాబాద్కు చేరుకున్న అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితుడిని విచారించిన పోలీసులు మంగళవారం అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు.