Karnataka | కర్ణాటక ( Karnataka) రాష్ట్రం హసన్ జిల్లా (Hassan district)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐఫోన్ (iPhone) కోసం డెలివరీ ఏజెంట్ (delivery agent) ప్రాణాలు తీశాడో వ్యక్తి. ఈ ఘటన ఫిబ్రవరి 7వ తేదీన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
లక్ష్మీపుర లే అవుట్ సమీపంలో నివాసం ఉండే హేమంత్ దత్తా (Hemanth Dutt) అనే 20 ఏండ్ల వ్యక్తి
ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ ఐఫోన్ను రూ.46వేలకు బుక్ చేసుకున్నాడు. అతను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్
పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 7వ తేదీన ఇ-కార్ట్ ఎక్స్ప్రెస్ డెలివరీ (EKart express delivery)
ఏజెంట్ హేమంత్ నాయక్.. ఫోన్ను కస్టమర్ ఇంటికి డెలివరీ చేసేందుకు వెళ్లాడు.
రూ.46వేలు చెల్లించి ఫోన్ తీసుకోవాలని కోరాడు. అయితే హేమంత్ వద్ద డబ్బు లేకపోవడంతో డెలివరీ ఏజెంట్పై కత్తితో దాడి చేశాడు. నాయక్ను విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని నాలుగు రోజులు ఇంట్లోనే ఉంచాడు. మృతదేహం వాసన రావడంతో ఓ సంచిలో చుట్టి బైక్పై రైల్వే స్టేషన్ సమీపంలో దహనం చేశాడు.
నాలుగు రోజులైనా డెలివరీ బాయ్ కనిపించకపోవడంతో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. కాల్ డేటా,
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు హేమంత్ను గుర్తించి అరెస్ట్ చేశారు. డెలివరీ బాయ్ మృతదేహాన్ని
నిందితుడు బైక్పై తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.