హైదరాబాద్ : హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. తాళాలు వేసి ఉన్న ఇండ్లను దొంగలు టార్గెట్ చేసి చోరీలకు పాల్పడ్డారు.
హిమాయత్ సాగర్ సమీపంలోని ఓ ఇంట్లోకి శనివారం తెల్లవారుజామున దొంగలు ప్రవేశించారు. ఆ ఇంట్లో ఉన్న 12 తులాల బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ. 50 వేల నగదును అపహరించారు. కిస్మత్పూర్లో ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు… ఐదు తులాల బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దోచుకెళ్లారు. బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన ఇండ్ల పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.