భోపాల్: మహిళ గొంతు కోసిన దొంగ, ఆ ఇంట్లోని నగదు, నగలు దోచుకున్నాడు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. దేపాల్పూర్లో 55 ఏండ్ల దఖాబాయి జైన్ శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉన్నది. ఒక దొంగ ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. గమనించిన ఆమె ఆ దొంగను ప్రతిఘటించింది. దీంతో అతడు రంపంతో ఆమె గొంతుకోశాడు. అనంతరం ఇంట్లోని బంగారు ఆభరణాలు, రూ.25,000 నగదు తీసుకుని పారిపోయాడు.
కాగా, కిరాణా షాపు నిర్వహించే మహిళ భర్త శాంతిలాల్ జైన్, మధ్యాహ్నం షాపు మూసి భోజనం కోసం ఇంటికి వచ్చాడు. రక్తం మడుగుల్లో పడి మరణించిన భార్యను చూసి షాక్ అయ్యాడు. ఇంట్లో చోరీ జరిగినట్లు గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మహిళ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు దొంగ ఆనవాళ్లను గుర్తించారు. ఒక వ్యక్తే చోరీ కోసం వచ్చి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.