న్యూఢిల్లీ : భారత్లో క్రిప్టో కరెన్సీ (Cryptocurrency) స్కామ్లు వేగంగా ప్రబలుతున్నాయి. గత కొద్ది నెలలుగా పలువురు ఇంటర్నెట్ యూజర్లు ఈ తరహా స్కామ్స్లో రూ. కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారు. వాట్సాప్, టెలిగ్రాం ద్వారా బాధితులకు వల వేస్తున్న స్కామర్లు వారి నుంచి ఆన్లైన్ అడ్డాగా అందినకాడికి దోచుకుంటున్నారు.
ఇక లేటెస్ట్గా ఢిల్లీకి చెందిన టెకీని స్కామర్లు బురిడీ కొట్టించి రూ. 12 లక్షలకు ముంచారు. ప్రముఖ కంపెనీలో ఇంజనీర్గా పనిచేసే అంకిత్ చౌధరిని స్కామర్లు ఇటీవల టెలిగ్రాం యాప్ ద్వారా సంప్రదించారు. క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తూ మెరుగైన లాభాలు ఆర్జించవచ్చని నమ్మబలికారు. టెలిగ్రాం గ్రూప్లో చేరి ఇన్వెస్ట్ చేసేందుకు బాదితుడు అంకిత్ చౌధరి అంగీకరించాడు.
తొలుత రూ. 10,000 ఇన్వెస్ట్ చేయాలని నమ్మబలికిన స్కామర్లు ఆపై రూ. 15,000 రిటన్స్ వచ్చేలా చేయడంతో వారిపై బాధితుడికి విశ్వాసం పెరిగింది. దీంతో పలుమార్లు స్కామర్ల సూచనతో రూ. 12 లక్షలు క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు. ఆపై చౌధరి ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు నిరాకరించిన స్కామర్లు అతడి ఖాతాను బ్లాక్ చేయడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను సంప్రదించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Woman cheated | ఉద్యోగాల పేరుతో రూ.60 లక్షల మోసం?.. సూర్యాపేటలో మహిళపై దాడి