హైదరాబాద్ : అతివేగంగా వచ్చిన వ్యాన్ అదుపుతప్పి బాలుడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సికింద్రాబాద్ పరిధిలోని ఆల్వాల్ వద్ద శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. రామ్చరణ్ (14) పాఠశాలకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా వ్యాన్ ఢీకొట్టడంతో తీవ్రగాయాలై ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని వదిలి డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. వ్యాన్ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.