పాట్నా: ప్రియురాలి బంధువులు ప్రియుడ్ని దారుణంగా కొట్టారు. రహస్య భాగాలను కత్తిరించడంతో తీవ్రగాయాలతో అతడు చనిపోయాడు. ఆగ్రహించిన యువకుడి కుటుంబ సభ్యులు ప్రియురాలి బంధువు ఇంటి ముందు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రేపు రాంపూర్షా గ్రామానికి చెందిన 17 ఏండ్ల సౌరభ్ కుమార్ శుక్రవారం రాత్రి పొరుగు గ్రామమైన సోర్బారాలో ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. వారిద్దరు కలిసి ఉండటాన్ని చూసిన ఆమె బంధువులు సౌరభ్ను దారుణంగా కొట్టారు. అతడి ప్రైవేట్ భాగాన్ని కత్తిరించారు. తీవ్రంగా గాయపడిన సౌరభ్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
సమాచారం అందుకున్న యువకుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అతడి మృతదేహాన్ని అప్పగించారు. మరోవైపు ఆగ్రహంతో రగిలిపోయిన యువకుడి బంధువులు, ప్రియురాలి బంధువు, ప్రధాన నిందితుడైన సుశాంత్ పాండే ఇంటి ముందు మృతదేహానికి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా, నిందితుడు సుశాంత్ పాండే అలియాస్ విజయ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా వారిని పట్టుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు. మరోవైపు సుశాంత్ పాండే ఇంటిపై దాడి చేసిన యువకుడికి చెందిన ముగ్గురు బంధువులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులను మోహరించారు.