Gujarat | గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఆదివారం మోర్బీ ప్రాంతంలోని మచ్చు నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో బ్రిడ్జి మీదుగా వెళుతున్న సందర్శకులు నదిలో పడిపోయారు. 60 మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య పెరుగొచ్చునని స్థానికులు, అధికారులు చెబుతున్నారు. నదిలో పడిపోయిన వారు 400 మందికి పైగా ఉండొచ్చునని పోలీసులు చెబుతున్నారు. పలువురు గాయ పడ్డారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
मोरबी गुजरात में बड़ा हादसा। पुल टूटने से कई लोग पानी में गिरे।#GUJARAT #morbi #bridge pic.twitter.com/JP0r6GZ09N
— अजीत तिवारी (@ajittiwari24) October 30, 2022
ఘటన జరిగినప్పుడు కేబుల్ బ్రిడ్జిపై సుమారు 500 మంది ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం గుజరాత్లోనే పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్తో మాట్లాడారు. ఘటనా స్థలానికి రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘవి బయలుదేరి వెళ్లారు.
Gujarat | A cable bridge collapsed in the Machchhu river, Morbi area today. Several people fear injured. Further details awaited. pic.twitter.com/OZrDTxCWqx
— ANI (@ANI) October 30, 2022
ఈ ఘటన తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఇటీవలే మరమ్మతులు ఈ బ్రిడ్జికి పూర్తి చేసి, గుజరాత్ నూతన సంవత్సరాది సందర్భంగా ఈ నెల 26న పునఃప్రారంభించారు.1879 ఫిబ్రవరి 20న నాటి బాంబే గవర్నర్ రిచర్డ్ టెంపుల్.. ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. దర్బార్గఢ్-నాజర్బాగ్ మధ్య నిర్మించిన ఈ బ్రిడ్జికి దాదాపు 140 ఏండ్ల చరిత్ర ఉంది. దీని పొడవు 765 అడుగులు ఉంటుంది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని ఇంగ్లండ్ నుంచి తెప్పించి మరీ పూర్తి చేశారు.
PM @narendramodi spoke to Gujarat CM @Bhupendrapbjp and other officials regarding the mishap in Morbi. He has sought urgent mobilisation of teams for rescue ops. He has asked that the situation be closely and continuously monitored, and extend all possible help to those affected.
— PMO India (@PMOIndia) October 30, 2022
సామర్థ్యానికి మించి ప్రజలు బ్రిడ్జిపైకి చేరడం వల్లే కుప్పకూలినట్లు తెలుస్తున్నది. గాయపడిన వారిని చికిత్స కోసం తరలించేందుకు భారీగా అంబులెన్స్లను మోహరించారు. స్థానికుల సాయంతో గల్లంతైన ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) కింద రూ.2 లక్షలు, గాయ పడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల సాయం ప్రకటించింది.
गुजरात के मोरबी में केबल पुल टूट गया। करीब 400 लोग नदी में गिर गए।
ईश्वर सबको सही सलामत रखें, यही प्रार्थना है। pic.twitter.com/GW4JurmYz7
— Congress (@INCIndia) October 30, 2022
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా కేబుల్ బ్రిడ్జి కూలిపోవడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు ప్రధాని ఆదేశాలిచ్చారని పీఎంవో ట్వీట్ చేసింది.
ఈ సమాచారం తెలిసిన వెంటనే సీఎం భూపేంద్ర పటేల్ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. నీటిలో మునిగిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి.