గణపురం : గణపురం మండలంలోని బంగ్లాపల్లి గ్రామానికి చెందిన ధరంసోత్ రూప్ సింగ్ (30) అప్పుల బాధతో సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం పరకాల ఆసుపత్రికి తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య సరిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూప్సింగ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.