బెంగళూరు: మొబైల్ ఫోన్లు చోరీ చేసేందుకు ఒక దొంగ రాత్రంతా షోరూమ్లోనే ఉన్నాడు. ఉదయం శుభ్రం చేసేందుకు షాప్ను తెరువగానే దొంగిలించిన ఫోన్లతో అక్కడి నుంచి పారిపోయాడు. అయితే పోలీసులు చాకచక్యంగా ఆ దొంగను పట్టుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. జేపీ నగర్లోని టాటా క్రోమ్ స్టోర్లోకి చొరబడిన ఒక దొంగ గురువారం రాత్రంతా అక్కడ నక్కి ఉన్నాడు. ఆరు ఖరీదైన సెల్ఫోన్లను చోరీ చేశాడు. మరునాడు ఉదయం షాపు తెరిచిన సిబ్బంది క్లీన్ చేస్తుండగా అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ దొంగను పట్టుకుని అరెస్ట్ చేశారు. అతడు దొంగిలించిన రూ.5 లక్షల ఖరీదైన ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని టాటా క్రోమ్ స్టోర్కు అప్పగించారు. బెంగళూరు నగర దక్షిణ విభాగం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) పి కృష్ణకాంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు నిందితుడి ఫొటోతో ట్వీట్ చేశారు. అయితే అతడి వివరాలు వెల్లడించలేదు.
Arrested.
An accused who had stolen 6 mobiles from Tata Chroma Store (JP Nagar) worth 5 lakhs. Accused stayed overnight on the store and when store was opened in the morning by the sweeper, he escaped. Police recovered all mobiles intact and handed over to Tata Chroma store. pic.twitter.com/OcaMztJMa4— P Krishnakant IPS (@DCPSouthBCP) July 29, 2022