వెంగళరావునగర్ : జైలుపాలైన భర్తకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మబలికి కత్తితో బెదిరించి మహిళ పై లైంగికదాడికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు, ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..
బాలానగర్కు చెందిన మహిళ (27) అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమా రుడు ఉన్నాడు. మహిళ భర్తకు పరిచయమైన బాలానగర్కు చెందిన ఎం.డీ జహంగీర్ అనే ఆటో డ్రైవర్ తరచూ ఇంటికి వచ్చిపోతుండేవాడు. కాగా మహిళ భర్తను పోలీసులు గత సంవత్సరం ఆగస్టులో గంజాయి కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారు.
ఈ సమయంలో ఇంటికి వచ్చిన జహంగీర్ బాధితురాలి భర్తకు బెయిల్ ఇప్పిస్తానని, న్యాయవాదిని ఏర్పాటు చేస్తానని నమ్మించాడు. ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్వీఆర్ ఓయో లాడ్జికి బాధితురాలిని తీసుకువచ్చాడు. అక్కడ గదిలో కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
విషయం ఎవరికైనా చెపితే మహిళ కుమారుడిని, ఆమె భర్తను చంపుతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు విషయం ఎవరికీ చెప్పుకోలేదు. ఇటీవల జహంగీర్ మల్లీ వేధిస్తుండటంతో గతంలో తనపై జరిగిన అత్యాచారం విషయమై బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.