భార్యాభర్తల మధ్య జరిగిన ఒక గొడవ ఒక చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. భర్తతో గొడవ పడిన సదరు భార్య.. కోపంతో 7 నెలల బాబుతో సహా ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సమయంలో బాబుపై శానిటైజర్ చల్లిన ఆమె.. తానూ కొంత శరీరంపై చల్లుకుంది.
అనంతరం నిప్పంటిచుకొని ఆత్మహత్యా యత్నం చేసింది. సదరు తల్లిని హయత్నగర్లో నివసించే సువర్ణగా గుర్తించారు. వారం రోజుల క్రితం బంజారా కాలనీలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆత్మహత్యా యత్నం చేసిన మహిళను, చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.
ఇక్కడ చికిత్స పొందుతూ ఆ పసికందు కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు. ఆ తల్లి ఇంకా చికిత్స పొందుతున్నట్లు సమాచారం.