ఖమ్మం : ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువగా ఉన్నాయని, వాటి నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ మన కుటుంబం సైబర్ నేరాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్ధి పై ఉందని ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారి సిగసారపు యాదయ్య అన్నారు. మంగళవారం నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రిక్కాబజార్లో జరిగిన సైబర్ కాంగ్రెస్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్బంగా డీఈఓ మాట్లాడుతూ.. ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇద్దరు విద్యార్థులు యూనిఫాం లేని పోలీసుగా ఉంటారన్నారు. ఆన్లైన్ మోసాలను అడ్డుకునేందుకు వీరు అవగాహన కల్పిస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కనపర్తి వెంకటేశ్వర్లు, మెంటర్ పి నివేదిత, అంబాసిడర్స్గా ఎంపికైన హర్షిత, రిషిత్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.