మాదన్నపేట :పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడమేంటని ప్రశ్నించిన పాపానికి స్నేహితుడిపై కత్తి తో దాడి చేసి గాయపరచిన సంఘటన సంతోష్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం రియాసత్ నగర్కు చెందిన అక్బర్, ఈసా స్నేహితులు. కొద్ది రోజులుగా అక్బర్ పెళ్ళైన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వేదిస్తున్నాడు.
కాగా ఈ విషయం అమ్మాయి భర్తకు తెలియడంతో అక్బర్ స్నేహితుడు ఈసాకు తన భార్య వెంట పడవద్దని అక్బర్తో చెప్పాలని కోరాడు. ఈ విషయం అతని స్నేహితుడే అమ్మాయి భర్తకు చెప్పాడనే అనుమానంతో బుధవారం కత్తితో దాడి చేశాడు. బాదితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని గాయపడిన ఈసాను చికిత్సకోసం దవఖానకు తరలించామన్నారు. అనంతరం అక్బర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.