అమరావతి: గుంటూరు జిల్లాలో తెలంగాణ పోలీసులపై రేషన్ మాఫియాకు సంబంధించిన దాడి చేసి గాయపరిచారు. దాచేపల్లిలో రేషన్ అక్రమ తరలింపు కేసులో శ్రీనివాసరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై దాడి చేశారు. ఘటనలో స్థానికులు కూడా దాడి చేయడం కలకలం సృష్టించింది. ఈ దాడిలో పోలీసులకు గాయాలు కాగా నిందితులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసులపై దాడి చేసిన వారిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు.