బంజారాహిల్స్,ఆగస్టు 17: దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్కుమార్పై బంజారాహిల్స్ పీఎస్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లారంలోని మారుతీనగర్కు చెందిన బ్యాగరి నర్సింహులు(41) అనే వ్యక్తి పాత సినిమాల రిస్టోరేషన్ టెక్నీషియన్గా పనిచేస్తుంటాడు. దర్శకుడు దాసరి నారాయణరావు వద్ద 2012నుంచి 2016దాకా సినిమాల రిస్టోరేషన్ పనులను ఔట్సోర్సింగ్ పద్ధతిలో చేశాడు.
దాసరి మృతి తర్వాత కూడా పనులు బ్యాలెన్స్ ఉండడంతో పలుమార్లు జూబ్లీహిల్స్లోని దాసరి ఇంటికి వెళ్లి పనులు పూర్తి చేశారు. కాగా, ఈ పనుల కోసం రావాల్సిన డబ్బుల విషయంలో దాసరి కొడుకులు దాసరి అరుణ్కుమార్, దాసరి ప్రభులతో వివాదం ఉంది. ఈ నేపథ్యంలో ఈనెల 13న ఫిలింనగర్లోని ఎఫ్ఎన్సీసీ వద్దకు రావాలని దాసరి అరుణ్ చెప్పడంతో నర్సింహులు తన స్నేహితులు శ్రీనివాస్, చంటితో కలిసి అక్కడకు వెళ్లాడు.
కాసేపటికి అక్కడకు వచ్చిన దాసరి అరుణ్కుమార్ నర్సింహులును కులంపేరుతో దూషించాడు. ఈ మేరకు బాధితుడు నర్సింహులు ఈ నెల 16న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.