ముంబై : క్రూయిజ్ పార్టీ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఈనెల 20 వరకూ జైలులో గడపనున్నాడు. ఆర్యన్ బెయిల్ పిటిషన్పై ముంబై కోర్టులో వాదనలు ముగియడంతో తీర్పును న్యాయమూర్తి రిజర్వ్లో ఉంచారు. దసరా తర్వాత ఈనెల 20న తాను ఉత్తర్వులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆర్యన్ ఖాన్ తరచూ డ్రగ్స్ సేవిస్తాడని ఎన్సీబీ కోర్టుకు నివేదించింది. తన క్లెయింట్ డ్రగ్స్కు బానిస కాదని, అయినా డ్రగ్స్కు బానిసైన వారి పట్ల సానుభూతితో వ్యవహరించాల్సి ఉందని ఆర్యన్ ఖాన్ న్యాయవాది అమిత్ దేశాయ్ పేర్కొన్నారు.
దర్యాప్తునకు విఘాతం కలగకుండా షరతులతో బెయిల్ మంజూరు చేయవచ్చని కోర్టును అభ్యర్ధించారు. వాట్సాప్ చాట్స్ను ఆధారాలుగా పరిగణించలేమని ఎన్సీబీ వాదన పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. ఆర్యన్కు అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్లో ప్రమేయం ఉందనే ఆరోపణలను ప్రస్తావిస్తూ ఈ బాలుడికి అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్తో సంబంధం ఉందా అని కోర్టును ఉద్దేశించి ప్రశ్నించారు. ఇవి పూర్తిగా అసంబద్ధమైన తప్పుడు ఆరోపణలని చెప్పారు. రేవ్ పార్టీ గురించి ఆర్యన్ నుంచి ఎలాంటి మెసేజ్లు లేవని తెలిపారు.కాగా అక్టోబర్ 3న ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్లో జరిగిన రేవ్ పార్టీపై ఎన్సీబీ దాడుల్లో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ సహా పలువురు పట్టుబడిన సంగతి తెలిసిందే.