అబిడ్స్ : అక్రమంగా గంజాయి విక్రయాలు చేపడుతున్న వారిపై మంగళ్హాట్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గంజాయి క్రయ, విక్రయాలు, రవాణాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అరెస్ట్లు చేసి గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు కేసుల్లో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 3.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఇన్స్పెక్టర్ ఎన్ రవి కథనం ప్రకారం….జాలిహనుమాన్ ప్రాంతంలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న టి చంద్రశేఖర్సింగ్ను అరెస్ట్ చేయగా మరో నిందితుడు సతీష్ పాల్సింగ్ పరారీలో ఉన్నాడు. వారి వద్ద 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా మరో కేసులో అక్రమంగా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న గాయిత్రి దేవి (39), మరో బాలికను అరెస్ట్ చేసి వారి నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
మరో వ్యక్తి నందకిషోర్ సింగ్ పరారాలో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ ఎన్ రవి తెలిపారు. ఈ కేసును మంగళ్హాట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.