బంజారాహిల్స్ : నిషేదిత మత్తుపదార్ధాలను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ సైట్-3లోని పద్మావతినగర్లో నివాసం ఉంటున్న మహ్మద్ మహబూబ్ అలీ అలియాస్ షూటర్ (33). ఎండీ.సర్ఫరాజ్(19) అనే యువకులు జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం నిషేదిత మత్తుపదార్థాలు విక్రయిస్తున్నారు.
ఫిలింనగర్ సమీపంలోని కొత్త చెరువువద్ద నిలబడి గంజాయి ద్రావణాన్ని విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. వారివద్దనుంచి నిషేదిత మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.