అంబర్పేట : జల్సాలకు అలవాటు పడి చైన్స్నాచింగ్కు పాల్పడిన ఓ యువకుడిని నల్లకుంట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతని నుంచి స్నాచింగ్ చేసిన 13.7 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి బుధవారం నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ మురళీధర్, కాచిగూడ ఏసీపీ ఆకుల శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు.
నల్లకుంటకు చెందిన ఇంటర్ చదువుతున్న బాలిక ఈ గత నెల 29న రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో నాగమయ్యకుంటకు చెందిన వడ్డి శివ ఏపీ 11క్యూ8681 హోండా ఫ్యాషన్ ప్లస్ పై వెళ్తూ ఆ బాలిక మెడలో ఉన్న బంగారు గొలుసును తెంచుకొని పారిపోయాడు. వెంటనే ఆ బాలిక నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా అతడు ఉపయో గించిన బైక్ నెంబర్ సహాయంతో ఆ బైక్ కాశీనాథ్గౌడ్కు చెందినదని గుర్తించి అతన్ని ఆరా తీశారు. ఏడాది క్రితం తన బైక్ను వడ్డి శివకు విక్రయించానని అతను చెప్పడంతో నాగమయ్యకుంటలోని శివ ఇంటికి వెళ్లి అతని అదుపులోకి తీసుకున్నారు.
స్నాచింగ్కు సంబంధించి వివరాలు అడుగగా తానే చేశానని ఒప్పుకున్నాడు. అతని నుంచి 13.7 గ్రాముల బంగారు గొలుసును, స్నాచింగ్కు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతన్ని రిమాండ్కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ మొగిలిచెర్ల రవి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ డి.కిషన్లు పాల్గొన్నారు.