శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో దారుణం జరిగింది. సర్వీస్ రైఫిల్తో కాల్చుకుని ఒక జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం అర్ధరాత్రి బెలిచరాన ఏరియాలోని రాయ్పిర్ ఆర్మీ క్యాంప్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్కు చెందిన నితీశ్ మిశ్రా ఆదివారం జమ్ముకశ్మీర్లోని రాయ్పిర్ ఆర్మీ క్యాంప్లో సెంట్రీగా విధుల్లో ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో తన సర్వీస్ రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జవాన్ ఆత్మహత్యకుగల కారణాలు తెలియాల్సి ఉందని వారు చెప్పారు.