మారేడ్పల్లి : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్లోని 4వ నంబర్ ఫ్లాట్ఫాంపై గుర్తు తెలియని వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందినది.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. మృతురాలి వయసు సుమారు 65 ఏండ్లు ఉంటాయని తెలిపారు. ఒంటిపై ఎరుపు, తెలుపు చీర ధరించి ఉన్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.