కాచిగూడ : అనుమానాస్పద స్థితిలో ఫుట్పాత్పై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ ఏఎస్సై సాయిరాం తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి (40) కాచిగూడ నింబోలి అడ్డాలోని గాయత్రి మెడికల్ హాల్ సమీపంలో గల ఫుట్పాత్పై అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందాడు.
సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు. మృతి చెందిన వ్యక్తి నోటిలోంచి రక్తం రావడంతో ఎవరైన వ్యక్తులు కొట్టి చంపారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
మృతుని ఒంటిపై గొదుమ రంగు చొక్క, నీలి రంగు ప్యాంట్ ధరించి ఎత్తు 5.5 ఉన్నట్లు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాల కోసం 8328640779లో సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.