హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో విషాదం నెలకొంది. గుండెపోటుతో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. కువైట్ నుంచి హైదరాబాద్కు ఓ ప్రయాణికుడు వస్తున్నాడు. అయితే అతనికి ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. అప్పటికీ విమానం గాల్లోనే ఉంది.
శంషాబాద్ ఎయిర్పోర్టుకు దగ్గర్లోనే విమానం ఉండటంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, మెడికల్ బృందాలను అప్రమత్తం చేశారు. విమానం ల్యాండ్ కాగానే.. బాధిత ప్రయాణికుడిని సమీపంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.