బెంగళూర్ : బాయ్ఫ్రెండ్ను కలిసేందుకు దుబాయ్ నుంచి బెంగళూర్కు వచ్చిన ఎయిర్ హోస్టెస్ అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి తనువు చాలించింది. కోరమంగళ ప్రాంతంలోని రేణుక రెసిడెన్సీలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతురాలిని హిమాచల్ ప్రదేశ్కు చెందిన అర్చన (28)గా గుర్తించారు. ప్రముఖ ఎయిర్లైన్లో కంపెనీలో పనిచేస్తున్న అర్చన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఫ్రెండ్ అధేష్ను కలిసేందుకు దుబాయ్ నుంచి నగరానికి వచ్చినట్టు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
కేరళకు చెందిన అధేష్ బెంగళూర్లో టెకీగా పనిచేస్తున్నాడు. గత కొన్నేండ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :