హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా మండలం సలాఖపూర్లో ఎయిర్గన్ కలకలం సృష్టించింది. బుధవారం రాత్రి ఎయిర్గన్ పేలిపోయింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు యువకుడి చేతిలో ఎయిర్గన్ పేలడంతో.. అక్కడికక్కడే యువకుడు మృతి చెందాడు. మృతుడిని హైదరాబాద్ లంగర్హౌస్కు చెందిన ముసాఫ్గా గుర్తించారు. స్నేహితులతో కలిసి సలాఖపూర్ బంధువుల ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.