Greater Noida | రెండు రోజుల క్రితం ఢిల్లీ శివారులోని కాంజావాల్ ప్రాంతంలో 20 ఏండ్ల యువతిని కారు సుమారు 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ అమానవీయ ఘటన మరవకముందే.. అలాంటిదే మరో దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ నోయిడాలో అతివేగంగా వచ్చిన ఓ కారు ముగ్గురు యువతులపైకి దూసుకెళ్లింది. వివరాల్లోకి వెళితే…
అతివేగంగా వచ్చిన కారు బీటెక్ చదువుతున్న ముగ్గురు అమ్మాయిలపైకి దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటనలో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ముగ్గురు విద్యార్థినులు గ్రేటర్ నోయిడాలోని కైలాష్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. కాగా, బాధితుల్లో ఒకరైన స్వీటీ కుమారికి తల, కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం స్వీటీ కోమాలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఆమె సోదరుడు సంతోష్ కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆమె చికిత్స కోసం ఇప్పటికే రూ.లక్ష ఖర్చు అయ్యిందని.. స్వీటీ కోలుకునేందుకు మరో రూ.పది లక్షలు అవసరమని వైద్యులు వెల్లడించినట్లు చెప్పారు. ఈ మేరకు సాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు.
‘నా పేరు సంతోష్ కుమార్. నా సోదరి స్వీటీ కుమారి కోసం నేను ఫండ్స్ రైజ్ చేస్తున్నాను. తను గ్రేటర్ నోయిడాలోని జీఎన్ఐఓటీ కళాశాలలో బీటెక్ చదువుతోంది. రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోయింది. గ్రేటర్ నోయిడాలోని కైలాష్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. పూర్తిగా కోలుకునే వరకు ఆసుపత్రిలోనే చికిత్స అందించాలని వైద్యులు సూచించారు. ఇప్పటి వరకు మాకు రూ.లక్ష వరకు ఖర్చు అయ్యింది. తదుపరి చికిత్స కోసం మరో రూ.పది లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. దయచేసి సాయం చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నా’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
GREATER NOIDA
न्यू ईयर की रात नशेड़ी ने 3 छात्र को टक्कर मारी, 1 की हालत नाजुक, जिंदगी और मौत से जंग लड़ रही, मीडिया में खबरों के बाद से जागी पुलिस, परिवार की माली स्तिथि बेहद खराब, सरकार से की अपील
PS BITA 2@noidapolice @CMOfficeUP @CP_Noida pic.twitter.com/3R1Zwdcis2— हिमांशु शुक्ला (@himanshu_kanpur) January 3, 2023