ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో తుపాకీతో కాల్పులు జరిపి ఒక ఒకరి మరణానికి కారకుడైన మాజీ ఎంఐఎం అధ్యక్షుడు ఫారుఖ్ ను పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు.
కాగా, ఈ రోజు కోర్టు తుది తీర్పును వెలువరించనున్నది. వివరాల్లోకి వెళ్తే..గతేడాది డిసెంబర్ 18న ఆదిలాబాద్కు చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుఖ్ అహ్మద్ తను నివాసం ఉంటున్న తాటిగూడ ప్రాంతంలో చిన్నారులు ఆడుకునే క్రమంలో గొడవపడ్డారు.
కాగా, ఈ గొడవలో తలదూర్చిన ఫారుఖ్ పిల్లలకు సంబంధించి సమీపంలో ఉన్న మాజీ కౌన్సిలర్ జమీర్తో పాటు మరో ఇద్దరిపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన జమీర్ హైదరాబాద్లో చికిత్స పొందుతూ మరణించాడు. ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.