రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా ఆదిభట్ట పీఎస్ పరిధిలోని మన్నెగూడలో ఓ యువతి అపహరణకు గురైన విషయం విదితమే. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఆదిభట్ల సీఐ నరేందర్ పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 32 మందిని అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు. రెండు వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్కు తరలిస్తామన్నారు.
అరెస్టు అయిన వారిలో భాను ప్రకాశ్, రాథోడ్ సాయినాథ్, ఎన్ కార్తీక్, జీ ప్రసాద్, కే హరి, ఆర్ అవినాష్, ఏ రాజు, సోను కుమార్ పాశ్వాన్, మహ్మద్ ఇర్ఫాన్, నీలేష్ కుమార్ యాదవ్, బిట్టు కుమార్ పాశ్వాన్, పీ నిఖిల్, ఈ అనిల్, మహేశ్ కుమార్ యాదవ్, మహ్మద్ రిజ్వాన్, జావేద్ హుస్సేన్, మహ్మద్ ఇక్బార్, బీ సతీశ్, బిశ్వజిత్, ఏ యోగిందర్, ఎన్ గోపిచంద్, బీ యేశ్వనాథ్ రెడ్డి, ఎం మహేశ్, వీ మణిదీప్, బీ సిద్ధూ, జాదవ్ రాజేందర్ ఉన్నారు.