దుమ్ముగూడెం: మద్యం మత్తులో తల్లిని హతమార్చిన తనయుడు కల్లూరి నర్సింహారావును దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు భద్రాచలం సీఐ స్వామి దుమ్ముగూడెం పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని రామచంద్రునిపేటలో శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో కల్లూరి నర్సింహారావు తన తల్లి కల్లూరి పగడమ్మను డబ్బులు ఇవ్వకపోవడంతో హత్య చేశాడు.
ఈ క్రమంలో దుమ్ముగూడెం ఎస్సై రవికుమార్ తన సిబ్బందితో కలిసి హంతకుడ్ని పట్టుకున్నారు. అతన్ని విచారించి కేసునమోదు చేసి భద్రాచలం కోర్టుకు రిమాండ్ చేసినట్లు సీఐ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్సై రవికుమార్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.