బంజారాహిల్స్ : ప్రమాదవశాత్తూ కరెంట్షాక్తో భవన నిర్మాణకార్మికుడు మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర్ దీనాజ్పూర్ ప్రాంతానికి చెందిన రాజారామ్ రిషి మిస్రీ (23) అనే అనే యువకుడు ఇటీవల బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని ఓ నిర్మాణంలో ఉన్న భవనంలో పనిచేస్తున్నాడు.
ఆదివారం ఉదయం సైట్లో పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్కు గురయ్యారు. దీంతో అతడిని బంజారాహిల్స్లోని స్టార్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.