హైదరాబాద్ : హైదరాబాద్లోని పాతబస్తీలో ఆదివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. మొఘల్పురా పోలీసు స్టేషన్ పరిధిలోని అంధేరి గల్లీలో ఇద్దరు యువకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. వీరిద్దరు మసీదు నుంచి తిరిగి వస్తుండగా ఒకరికొకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో మాటమాట పెరిగి కొట్టుకున్నారు. దీంతో ఓ యువకుడు మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడిని నవాజ్ అహ్మద్(15)గా పోలీసులు గుర్తించారు. అహ్మద్ను హత్య చేసిన వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.