నాగర్కర్నూల్ : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బైక్ను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వెల్దండ మండల పరిధిలోని బావి తండాకు చెందిన రమావత్ రాజు తన భార్య బుజ్జి, కుమారుడు మల్లేష్(20)తో కలిసి హైదరాబాద్లోని బాలాపూర్లో నివాసముంటున్నాడు. గిరిజనుల సీత్లా పండుగల వేడుకలకు రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ బావి తండాకు బయల్దేరాడు.
అయితే కడ్తాల్ వద్ద పెట్రోల్ పోయించుకున్న రాజు.. తన బైక్ను రోడ్డు మీదకు పోనిచ్చాడు. అదే దారిలో వేగంగా దూసుకొచ్చిన లారీ.. బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. మల్లేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.